మన తెలంగాణ/ఉమ్మడి కరీంనగర్ బ్యూరో: ఎపి బిజెపి ఎంపి సిఎం రమేశ్ చేసిన ఆరోపణలు అబద్ధమని చెబుతున్న కెటిఆ ర్ అందుకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ఆదివారం ఇక్కడ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను సవాల్ చేస్తున్నా. .వేదికను ఏర్పాటు చేస్తా..సిఎం రమేశ్ను తీసుకొస్తా. ఆధారాలతో సహా వివరిస్తా. డేట్, టైం ఫిక్స్ చెయ్… దమ్ముంటే చర్చకు ’ అని సవాల్ చేశారు. ‘సిఎం రమేశ్ కూడా ఇదే చెబుతున్న డు కదా? “కవితను జైలు నుండి విడిపిస్తే విలీనం చేస్తామని కెసిఆర్ కొడుకు ప్రతిపాదిస్తే… బిజెపి ఒప్పుకోలేదు. అది జరగని పని. అవినీ తి, కుటుంబ పార్టీ అయిన బిఆర్ఎస్ను విలీనం చేసుకోవడమే ఉండదు” అని తేల్చిచెప్పారు కదా? అని అన్నారు. ముఖ్యమంత్రి పదవికి కనీస గౌరవం ఇవ్వాలనే సోయి లేకుండా హౌలే, వాడు, నీ బొంద అని కెటిఆర్ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
కనీస సంస్కారం లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని అన్నారు. కాంగ్రెసోళ్లకు సిగ్గు లేదు…చేతకాని దద్దమ్మలు వాళ్లు అని వ్యాఖ్యానించారు. ప్రధానిని, బిజెపి నేతలను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. తమ కార్యకర్తలే నీ సంగతి చూస్తారని కెటిఆర్ను ఘాటుగా హెచ్చరించారు. అడ్డగోలుగా సంపాదించిన సొ మ్ముతో బలిసి సోషల్ మీడియా ద్వారా ఇష్టానుసారం రాయిస్తూ తమపై దృష్ప్రచారం చేస్తానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. కామారెడ్డి బిసి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది అది బిసి డిక్లరేషన్ కాదని ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషన్ బిల్లును తీసుకొచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో 27 శాతం రిజర్వేషన్లు బిసిలకు అమలవుతున్నాయని, అదనంగా బిసిలకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆ ముసుగులో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు న్నారని ఆరోపించారు.
అంటే తెలంగాణలో వంద శాతం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించబోతోందని మండిపడ్డారు. అట్లాంటప్పుడు అది బిసి డిక్లరేషన్ ఎట్లా అవుతుంది? అది ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషనే”అని స్పష్టం చేశారు. బిసి జాబితా నుండి ముస్లింలను తొలగించేదాకా ఆ బిల్లును అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. ముస్లింలను తొలగించి 42 శాతం రిజర్వేషన్లను పూర్తిగా బిసిలకు అమలు చేస్తేనే సంపూర్ణ మద్దతిచ్చి బిల్లు ఆమోదానికి కేంద్రాన్ని ఒప్పిస్తామని చెప్పారు. 50 శాతం రిజర్వేషన్ల గేట్లను బద్దలు కొట్టడం ద్వారా హిందుత్వాన్ని దెబ్బకొడతామంటూ మొన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పత్రికల్లో చూసి హిందువులంటే ఎంత ద్వేషమో ఆయన మాటల్లోనే అర్ధమవుతోందని అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే పెద్దమ్మ గుడి కూల్చివేత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసమే పెద్దమ్మగుడి కూల్చివేత అని ఆరోపించారు. ప్రతి ఏటా బోనాల పండుగను నిర్వహించుకునే బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని అధికారులు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. హిందువులంటే అంత చులకనా? తక్షణమే అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో జూ బ్లిహిల్స్ ఉప ఎన్నిక జరగబోతోంది కాబట్టి ఆ నియోజకవర్గంలో 30 శాతం ఓట్లున్న ఒక వర్గం వారిని సంతృప్తిపరిచేందుకు పెద్దమ్మ గుడిని కూల్చినట్లు అర్ధమవుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి..లేనిపక్షంలో హిందువుల దమ్మేందో చూపిస్తామని హెచ్చరించారు.
రాబోయే స్థానిక సంస్థల్లో కూడా బిజెపి అత్యధిక స్థానాలు గెలవబోతోందని జోస్యం చెప్పారు. ఎందుకంటే.. గ్రామాల్లో నిధులు ఎవరిస్తున్నారు? కేంద్రమే ఇస్తోంది కదా? మరి కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు ఎందుకు ఓట్లు వేయాలి? ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు.