Monday, May 5, 2025

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా స్వామి వారి దర్శనం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం తిరుమల వెంకన్న సర్వదర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. దీంతో వైకుంఠ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండాల్సి అవరసరం లేకుండా నేరుగా స్వామివారి దర్శించుకుంటున్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 2 నుంచి 4 గంటల సమయం పడుతోంది. ఇక, ఆదివారం తిరుమల వెంకన్నను 83,38 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,936 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ. 3.35 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News