- Advertisement -
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం వెంకన్న సర్వదర్శనం తిరుమలకు మోస్తరు సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో స్వామివారి సర్వదర్శనానికి భక్తులకు 6 నుంచి 8 గంటల సమయం పడుతోంది. ఇక, ఆదివారం తిరుమల వెంకన్నను 80,423 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,361 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.40 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.
- Advertisement -