- Advertisement -
తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం శ్రీవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక, సోమవారం వెంకన్నను 77,117 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 22,765 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.10 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.
- Advertisement -