Saturday, May 31, 2025

శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్ మెంట్లు నిండి, శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతుంది. రూ.300 శీఘ్రదర్శనంకు 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది. సర్వ దర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5 నుండి 6 గంటల సమయం పడుతుంది. గురువారం 69,019 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 37,774 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ. 3.42 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు. ఆరు గంటలకు పైగా భక్తులు లైన్లలో నిలిచి ఉండడంతో వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News