Thursday, September 18, 2025

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 10 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తిక పున్నంతోపాటు, ఆదివారం సెలవుదినం కావడంతో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో వెంకన్నను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది.

ఇక, శనివారం శ్రీవారిని 73,179 మంది భక్తులు దర్శించుకుని ముక్కులు తీర్చుకున్నారు. 20,291 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టిటిడి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News