Friday, June 6, 2025

ఫొటోల కోసం మేనల్లుడిని ముక్కలు ముక్కలుగా నరికి… సిమెంట్‌లో పూడ్చింది

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఫొటోలు బయటపెడుతానని బెదిరించడంతో మేనల్లుడిని అత్త చంపి అనంతరం ముక్కలు, ముక్కలు చేసి సిమెంటులో పూడ్చింది. ఈ సంఘటన పశ్చిమబెంగాల్‌లోని దినాజ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మాల్దా జిల్లాకు చెందిన సద్దా నదాబ్ అనే యువకుడు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నదాబ్ 20 రోజుల నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నదాబ్‌కు ఆమె మేనత్త మౌమిత హసన్ నదాబ్ తో వివాహేతర సంబంధం ఉన్నట్టు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకుంది. యువకుడు ఆమె చనువుగా ఉన్నప్పుడు ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలు బయట పెడుతానని బెదిరించడంతో హత్య చేశానని మౌమిత ఒప్పుకుంది. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి సిమెంట్ పూడ్చిపెట్టానని వివరణ ఇచ్చింది. పోలీసులు ఇంట్లోకి వెళ్లి తవ్వగా మృతదేహం ముక్కలు కనిపించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News