- Advertisement -
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎఎస్ రవికుమార్ చౌదరి గుండెపోటుతో కన్నుమూశారు. ఇంట్లో అస్వస్థతకు గురికావడంతో వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు గుండెపోటుతో చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. యజ్ఞం సినిమాకు దర్శకత్వం వహించి సినీ రంగంలోకి ప్రవేశించాడు. బాలకృష్ణ నటించిన వీరభద్ర సినిమాకు దర్శకుడిగా పని చేశారు. సౌఖ్యం, ఆటాడిస్తా, ఎం పిల్లో ఎం పిల్లడో, ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘తిరగబడరా స్వామి’ అనే సినిమాలకు దర్శకత్వం వహించారు.
- Advertisement -