Saturday, June 14, 2025

ఛార్జీల పోరులో భద్రతపై రాజీ

- Advertisement -
- Advertisement -

విమానయాన సంస్థల మధ్య
పెరుగుతున్న డిస్కౌంట్ల సమరం
తక్కువ ఛార్జీలతో భారంగా
మారనున్న విమానాల నిర్వహణ

ప్రయాణీకులను ఆకట్టుకునేందుకు ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి సంస్థలు తరచు ధరలు తగ్గించడమో, ఆఫర్లు ఇవ్వడమో మనదేశంలో సాధారణంగా జరిగేదే. తరచు విమానాల్లో ప్ర యాణించే వారందరికీ ఇది తెలుసు. ఆ సంస్థలు టికెట్ చార్జీలపై డిస్కౌంట్లు ఆఫర్ చేయడం ద్వా రా ఒక సంస్థ విమానంలో ప్రయాణించే వారిని మరో సంస్థ తమవైపు ఆకట్టుకునే ప్రయత్నాలు చే స్తూ ఉంటుంది. ఏ సంస్థ విమాన టికెట్లు కాస్త చౌకగా లభిస్తాయి. ఎవరు తరచు డిస్కౌంట్‌లు ఇ స్తారు అని చూసి ఆయా సంస్థలను ఇష్టపడే వా రు ఉన్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా, ఒక పాయింట్ కంటే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చే విమా న సంస్థలు వారి భద్రతపై రాజీ పడుతుందని వా రికి తెలుసా ? బహుశా తెలిసి ఉండకపోవచ్చు. విమానయాన నిపుణులు డిస్కౌంట్ల టికెట్ల పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రయాణీకుల ను ఆకర్షించడానికి విమానయాన సంస్థలు చేస్తు న్న ప్రయత్నం. దీని వల్ల ఇతర అంశాలపై ప్రభా వం ఉంటుందని వారు అంటున్నారు.

విమానం లో ప్రయాణికుల నుంచి విమానాల నిర్వహణ వ రకూ అన్నివిషయాలు నిరంతరం ఈచౌక చార్జీల వల్ల ప్రభావానికి లోనవుతున్నాయి.ప్రయాణికులు చెల్లించే టికెట్ చార్జీ లు వయిబిలిటీ స్థాయి కంటే తక్కువగా ఉంటే, భారీ సిబ్బందికి అయ్యే ఖర్చులు, విసృ్తతమైన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు అయ్యే ఖర్చులు పెరిగితే వచ్చే నష్టాలను భరించేందుకు ఎవరు ఇష్టపడతారు. కానీ, ఎవరికీ ఆ విషయం ఆలోచించే సమయమే లేదు. విమానాల నిర్వహణ విషయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఏ) కనీస ప్రొటోకాల్ కచ్చితంగా పాటిస్తోందా.? అదే జరిగి తే, ఎయిర్ ఇండియా కు చెందిన 200 పైగా విమానాల భద్రత ఆడిటింగ్ కు అథారిటీ ఇప్పుడు ఎందుకు ఆదేశించిం ది? గురువారంనాడు అహ్మదాబాద్‌లో జరిగిన అత్యంత దారుణమైన విమా న ప్రమాదం త ర్వాత ఈ అంశం తీవ్ర చర్చనీయాంశం అయిం ది. ప్రమాదంలో మృతుల సంఖ్య 300 వరకూ ఉంటోంది. ఇప్పటికీ లెక్కిస్తున్నారు. ఈ ప్రమా దం దేశాన్ని, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులను దిగ్భ్రమలో ముంచివేసింది. ఇప్పుడు మన విమాన భద్రతను ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని పరిశీలిద్దాం. చార్జీల విషయంలో పోటా పోటీ విమానయాన సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రోత్సహించవచ్చు.

అయితే భద్రతా చర్యలతో సహా విమానాల భద్రత విషయంలో సంస్థలు రాజీ పడేందుకు దారితీస్తుందని చెప్పేందుకు ఖచ్చితంగా ఎలాంటి ఆధారాలు లేవు. అయితే, ఆ అవకాశం ఉంది. ఆ విషయాన్ని క్షుణ్ణంగా పరిశించాల్సిన అవసరం ఉంది.అలాంటివి ఏమీ లేకుండా కచ్చితంగా మా విమానాల మెయింటెనెన్స్ చాలా కచ్చితంగా ఉంటుందని చెప్పడానికి వీలు లేదు. విమానాల నిర్వహణలో నిర్దిష్ట నాణ్యత ప్రమాణాలు ఆయా విమానయాన సంస్థను బట్టి, నిర్వహణ సంస్థను బట్టి , విమానం మోడల్ బట్టి, ఒక్కో విధంగా ఉంటుంది. అయితే విమాన నిర్వహణ సాధారణంగా చాలా ఖర్చుతో కూడిన విషయం. క్లిష్టమైన ప్రక్రియ. భద్రతతో పాటు రాజీ లేకుండా అన్ని అంశాల విషయంలో దృష్టి పెట్టాల్సి ఉంటుంది. విమాన నిర్వహణ విషయంలో అమెరికాలోని ఎఫ్‌ఏఏ, లేదా యూరప్ లోని ఇఏఎస్ ఏ వంటి విమానయాన సంస్థల అధికారులు కఠినంగా వ్యవహరిస్తారు. అన్ని కంట్రోల్ చేస్తారు. కచ్చితంగా ప్రమాణాలను పాటించబడుతున్నాయని నిర్థారిస్తారు. ప్రభావ వంతమైన నిర్వహణ లో క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తారు. ప్రతి అంశాన్ని క్షణ్ణంగా తనిఖీ చేస్తారు. సమస్యలు తలెత్తకముందే దానిని నిరోధానికి చర్యలు తీసుకుంటారు. సకాలంలో మరమ్మతులు చేస్తారు.

శిక్షణ, నైపుణ్యం-
ఎయిర్ క్రాఫ్ట్ నిర్వహణ నిపుణులైన ఇంజనీర్లు (ఎఎంఇలు) తమ ఉద్యోగాలను సమర్థవంతంగా నిర్వహించడానికి విసృ్తతమైన శిక్షణ, సర్టిఫికేషన్ అవసరం. సాంకేతిక రంగంలో పురోగతి- విమాన నిర్వహణ సామర్థ్యం, విశ్వసనీయత మెరుగు పరచేందుకు , ప్రివెంటివ్ మెయింటెనెన్స్ , డేటా ఎనలిస్టిక్ వంటి కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని అమలు చేస్తున్నారు. ఆర్థిక పరిణనలు- విమాన నిర్వహణ ఖర్చు, డౌన్ టైమ్ తో సహా కచ్చితంగా, గణనీయంగా ఉంటుంది. ఇది విమానయాన సంస్థ ఖర్చును విశ్వసనీయతతో బ్యాలెన్స్ చేసే విధంగాఒత్తిడి తెచ్చే లా ఉంటుంది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా విమానయాన పరిశ్రమ నిరంతరం అభివృద్ధి చెందుతోంది. నిపుణులైన సమర్థులైన ఏఎంఇ లకు డిమాండ్ పెరుగుతోంది. విమానాల భద్రత, సామర్థ్యం మెరుగు పరచడంపై దృష్టి మరింత పెరుగుతోంది. డౌన్ టైమ్ , సంక్లిష్టమైన అంశాలు, పెద్ద డేటాసెట్ ల నిర్వహణ వంటి అంశాల్లో కొన్ని చిన్నచిన్న సవాళ్లు మిగిలినా, విమానయాన సంస్థలు నిర్వాహక ప్రొవైడర్లు విమానాల మెయింటెనెన్స్ మెరుగు పరచేందుకు కొత్త సాంకేతిక అంశాల పైనా, మెరుగైన పద్ధతులలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News