Monday, June 30, 2025

త్వరలో కర్ణాటక సిఎంగా డికె శివకుమార్

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న డికె శివకుమార్ 2,3 నెలల్లో సిద్దరామయ్య స్థానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ ఏ ఇక్బాల్ హుస్సేన్ పేర్కొన్నారు. కొద్ది నెలలుగా కర్ణాటక లో
ముఖ్యమంత్రిని అధిష్టానం మార్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. సెప్టెంబర్ తర్వాత కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని ఈ మధ్యనే సహకార శాఖమంత్రి కెఎన్. రాజన్న సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే డికె శివకుమార్ కు సన్నిహితుడైన ఇక్బాల్ హుస్సేన్ చేసిన తాజా ప్రకటన చర్చనీయాంశం అయింది. కర్ణాటకలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు డికె శివకుమార్ తీవ్రంగా కృషి చేశారన్న విషయం అందరికీ తెలుసునని, అధిష్టానం కూడా డికె శివకుమార్ పట్ల సానుకూల ధోరణితోనే ఉందని హుస్సేన్ తెలిపారు.

ఊహాగానాల మీద తనకు నమ్మకం లేదని, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా హైకమాండ్ కు తెలుసునని, తగిన సమయంలో కాంగ్రెస్ అధిష్టానం తగిన నిర్ణయం తీసుకుంటుందన్న పూర్తినమ్మకం తనకు ఉందని ఇక్బాల్ హుస్సేన్ వివరించారు.2024 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత సీఎం పదవికి సిద్దరామయ్య, శివకుమార్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అధిష్టానం నచ్చచెప్పడంతో డికే శివకుమార్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు. అప్పట్లోనే
రొటేషన్ సిఎం ఫార్ములా అంటూ వార్తలు వచ్చాయి. అంటే రెండున్నర ఏళ్లపాటు సిద్దరామయ్య, మరో రెండున్నర సంవత్సరాల పాటు డికే శివకుమార్ ముఖ్యమంత్రిపదవిలో కొనసాగుతారనే ప్రచారం సాగింది. అయితే,దీనిని అధికారికంగా పార్టీ నాయకత్వం ధ్రువీకరించలేదు. ముఖ్యమంత్రి మార్పు వార్తలను కేవలం ఊహాగానాలుగా సిఎం సిద్దరామయ్య కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్ర సిద్దరామయ్య తోసి పుచ్చారు.

2023లో కాంగ్రెస్ హైకమాండ్ సిద్దరామయ్యను సీఎంగా ఎంపిక చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా ప్రస్తుతం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న డికె శివకుమార్ ఎన్నడూ తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు సుస్పష్టంగా చెబుతూ వచ్చారు. 2023 లో సిద్దరామయ్యను సిఎంగా నిర్ణయించిన కాంగ్రెస్ అధిష్టానమే త్వరలో డికె విషయంలోనూ కచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందని,
ఇక్బాల్ హుస్సేన్ ఇతరులు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News