Thursday, June 19, 2025

పాక్‌తో కాల్పుల విరమణలో మీ ప్రమేయం లేదు

- Advertisement -
- Advertisement -

ట్రంప్‌కు తేల్చి చెప్పిన ప్రధాని మోడీ
పాక్ మోకరిల్లితేనే అంగీకరించామని
స్పష్టీకరణ అమెరికా పర్యటనకు
రావాలన్న ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించిన
ప్రధాని అమెరికా అధ్యక్షుడితో
టెలిఫోన్‌లో మాట్లాడిన మోడీ భారత్
పర్యటనకు రావాలని ఆహ్వానం

న్యూఢిల్లీ : గతనెల భారత్ – పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం కానీ ఆదేశం పాత్ర కానీ లేదని,అలాగే ఆ ఘర్షణ సమమయంలో అమెరికా -భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం పై ఎలాంటి చర్చ జరగలేదని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడుతూ మోడీ రికార్డును సరిదిద్దా రు. కెనడాలో జి-7 శిఖరాగ్ర సమావేశానికి వెళ్లి తిరిగి వస్తుండగా వైట్ హౌస్‌కు రావాలన్న ట్రంప్ ఆహ్వానా న్ని కూడా మోదీ తిరస్కరించారు. జూన్ 18న తాను క్రొయేషియాకు వెళ్లాల్సిఉందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ అభ్యర్థన మేరకు ఆయనతో ప్రధాని జరిపిన 35 నిముషాల సంభాషణపై విదేశాంగ కార్యదర్శి వి క్రమ్ మిస్రీ మాట్లాడారు. పాక్ – భారత సాయుధ ఘ ర్షణ సమయంలో ఏ సమయంలోనూ, ఏ స్థాయిలోనూ కూడా అమెరికా- భారత్ మధ్య వాణిజ్యం గురించి కానీ, ఇరుదేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వం గురించి కానీ ఎటువంటి చర్చ జరగలేదని ప్రధాని మోడీ ప్రెసిడెంట్ ట్రంప్ కు స్పష్టం చేశారని మిస్రీ వివరించారు. ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో దాదాపు 35 నుషాలపాటు ఫోన్ లో మాట్లాడారని విక్రమ్ మిస్రీ ప్రకటించారు. చర్చ సందర్భంగా ప్రధాని మోడీ ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ కు వివరించారని పేర్కొన్నారు. మే 7న భారతదేశం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించినతర్వాత ఉభయనాయకుల మధ్య నేరుగా జరిగిన తొలి సంభాషణ ఇది.

అనంతరం కొద్ది గంటల తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్, ట్రంప్ మధ్య సమావేశం జరిగినట్లు తెలిసింది. సైనిక చర్యను నిలిపి వేయాలన్న పాకిస్తాన్ అభ్యర్థన మేరకు రెండుదేశాల సైనిక అధికారుల మధ్య నేరుగా సంభాషణలు జరిగాయని ప్రధాని చెప్పినట్లు విక్రమ్ మిస్రీ వివరించారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తాను కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించానని, వాణిజ్యాన్ని నిలిపి వేస్తానని బెదిరించడం ద్వారా రెండు దేశాలను బలవంతంగా యుద్ధం విరమణకు ఒప్పించాని పదే పదే పేర్కొన్నారు. కాగా పాకిస్తాన్ పట్టుబట్టడం వల్లే కాల్పుల విరమణకు నేరుగా ఆదేశం సైనిక నాయకులతో చర్చలు జరిగాయని భారతదేశం చెబుతూ వచ్చింది. ట్రంప్ వాదనలను తోసిపుచ్చింది. జీ -7 శిఖరాగ్ర సభ నేపథ్యంలో ఉభయనాయకుల మధ్య సంభాషణ జరగవలసిఉంది. కానీ, ఇరాన్ -ఇజ్రాయెల్ యుద్ధం ముదిరిపోవడంతో ట్రంప్ హఠాత్ గా బయలుదేరి అమెరికా వెళ్లి పోవడంతో ఆ సమావేశం జరగలేదు. ఫోన్ లో ట్రంప్ తో మోడీ సంభాషణలో ఆపరేషన్ సిందూర్ గురించి వివరించారు.

భారతదేశం చర్య ఖచ్చితంగా, సుస్పష్టంగా, నిర్దేశించిన లక్ష్యాల మేరకే జరిగిందని ప్రధాని నొక్కి చేప్పారు. మే 9న రాత్రి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ భారతదేశంపై పాక్ దాడిచేసే అవకాశం ఉందని హెచ్చరించారని మోడీ వెల్లడించారు. తమను రెచ్చగొడితే భారతదేశం మరింత తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని స్పష్టం చేసినట్లు ట్రంప్ లో మోడీ అన్నారు. పాకిస్తాన్ భవిష్యత్ లో ఇలాంటి దురాక్రమణ చర్యలకు దిగితే, తీవ్రమైన ప్రతీకార చర్య తప్పదని మోడీ అమెరికా ప్రెసిడెంట్ కు స్పష్టం చేశారు. త్వరలో జరిగే క్వాడ్ సమావేశం సందర్భంగా భారతదేశాన్ని సందర్శించాలని ప్రధాని మోడీ ట్రంప్‌ను ఆహ్వానించారు. ట్రంప్ ఆ సమావేశంలో పాల్గొంటానని ధ్రువీకరించకపోయినా ఆహ్వానాన్ని అంగీకరించారు. చైనా ఆధిపత్యం చేసేందుకు యత్నిస్తున్న ఇండో -పసిఫిక్ ప్రాంతంలో సుస్థరత సాధించడానికి క్వాడ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉభయ నాయకులు పునరుద్ఘాటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News