మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట వ్యాప్తంగా అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యారణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధికారులను ఆదేశించారు. అలాగే వన్యప్రాణులకు (wildlife) తాగునీరు(water), ఆహారం(food) విషయంలో ఎటువంటి అశ్రద్ధ వహించద్దని సూచించారు. ఒకేసారి పెద్ద అగ్ని ప్రమాదాలు జరిగితే వాటిని నివారించేందుకు అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అడవుల్లో అగ్ని ప్రమాదాలు, నివారణ, వన్యప్రాణి(wildlife) సంరక్షణ చర్యలపై సంబంధిత ఉన్నతాధికారులతో సచివాలయంలోని తన ఛాంబర్లో మంగళవారం రాష్ట్రంలోని వివిధ జోన్ల సీసీఎఫ్లు, అన్ని జిల్లాల డీఎఫ్ఓలతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ అగ్నిప్రమాదాల వల్ల వన్యప్రాణులు ఇబ్బందులు పడకుండా ఏమి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. అటవీ శాఖ తరఫున ఏం చర్యలు తీసుకుంటున్నదీ వైల్ లైఫ్ బోర్డు ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు. వేసవి దృష్ట్యా అడవుల్లో, జూ లలో వన్యప్రాణుల, ఇతర జంతవులకు తగిన తాగునీటి (water) సదుపాయాల కల్పన ఉందా అని మంత్రి సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ఇందుకు అధికారులు సమాధానం ఇస్తూ అయితే, ఈ వేసవిలో జంతువుల కోసం 2,168 నీటి గుంతలు ఏర్పాటు చేసినట్టు మంత్రికి వివరించారు. నీటి గుంతల్లోకి నీటిని ప్రతిరోజూ ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా ఎప్పటికప్పుడు తీసుకువస్తున్నామని తెలిపారు.
నెహ్రూ జూ పార్కు, వరంగల్ జూ పార్కులలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సురేఖ సూచించారు. ప్రత్యేకంగా నీటి లభ్యత ఉన్న ఆహార పదార్థాలు(food), పండ్లు దోసకాయ, పుచ్చకాయ వంటివి వాటికి ఆహారం అందజేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో పీసీసీఎఫ్ డాక్టర్.సువర్ణ, పీసీసీఎఫ్ (వైల్ లైఫ్) ఈలు సింగ్ మేరు, పీసీసీఎఫ్( స్కీమ్స్) జవహర్, వైల్ లైఫ్ ఓఎస్డీ శంకరన్, నెహ్రూ జూ పార్క్ డైరెక్టర్ సునీల్ హీరామత్ తదితరులు పాల్గొన్నారు.