Wednesday, June 25, 2025

కోలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు.. మరో నటుడి కోసం పోలీసుల గాలింపు

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళ సినీ ఇండస్ట్రీని డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది. పలువురు సినీ నటులు, సంబంధిత వ్యక్తులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం అందుకున్న చెన్నై నార్కోటిక్స్ ఇంటలిజెన్స్ పోలీసులు.. వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎఐఎడిఎంకె కార్యనిర్వాహకుడు ప్రసాద్ నుండి డ్రగ్స్ కొన్నట్లు ఆరోపణలు రావడంతో శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షలు నిర్వహించగా.. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో శ్రీరామ్ ను అరెస్టు చేసి విచారించారు. ఆయన ఇచ్చిన సమాచారంతో మరో నటుడు కృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో మొదట విచారణకు వచ్చిన నటుడు కృష్ణ తర్వాత పరారైనట్లు సమాచారం. తమిళ యువ దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లతో కృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆయనను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను రంగలోకి దించారు. కాగా, టాలీవుడ్ నటులతోనూ కృష్ణకు సన్నిహిత సంబంధాలు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News