Tuesday, June 3, 2025

మద్యం మత్తులో పాదచారులను ఢీకొట్టిన కారు డైవర్

- Advertisement -
- Advertisement -

పుణె: మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపిన ఓ డ్రైవర్ (Drunken Driver) బీభత్సం సృష్టించాడు. రోడ్డుపై ఓ టీ కొట్టు వద్ద ఉన్న పాదచారులను కారుతో ఢీకొట్టాడు. మహారాష్ట్రలోని పుణెలో సదాశివపేట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కారును మలుపు తిప్పే క్రమంలో నియంత్రణ కోల్పోయాడు. దీంతో మూల మలుపు వద్ద టీ తాగుతున్న వారిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో గాయపడిన వారిలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న పలువురు విద్యార్థులు ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు కారణమైన కారు డ్రైవర్‌తో పాటు.. కారులో ఉన్న మరో ఇద్దరిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News