ప్రదీప్ రంగనాథన్ తను దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ ’లవ్ టుడే’తో నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత తమిళం, తెలుగు రెం డింటిలోనూ విజయం సాధించిన తన ఇటీవలి హిట్ ’డ్రాగన్’ (Dragon)తో మాసీవ్ పాపులరిటీ సాధించారు. పాన్ -ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా తమి ళం, -తెలుగు ద్విభాషా ప్రాజెక్టు చేస్తోంది. కీర్తిశ్వరన్ ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం కానున్నారు. ’ప్రేమలు’ చిత్రంతో అందరినీ అలరించిన మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుండగా, సీనియర్ నటుడు శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. శనివారం ఈ సినిమా టైటిల్ను అధికారింగా విడుదల చేశారు.
యూత్ని ఆకట్టుకునే విధంగా ‘డ్యూడ్’ అనే టైటిల్ తో రూపొందిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రదీప్ రంగనాథన్ ఇంటెన్స్ అవతార్ లో, ముఖం మీద గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకుని కనిపించారు. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లో సూచించినట్లుగా, డ్యూడ్ మోడరన్ ట్విస్ట్తో కూడిన పూర్తి ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఈ చిత్రం 2025 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సాయి అభ్యాంకర్ మ్యూజిక్ అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. డ్యూడ్ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.