కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేశ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం ఈ సమన్లు పంపినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. జూన్ 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సూచించారు. గత ఏప్రిల్లో ఐశ్వర్య గౌడ అనే మహిళను ఈడీ అరెస్టు చేసింది. ఈమెకు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయని, అప్పట్లో వార్తలు వచ్చాయి. తాను పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులకు సన్నిహితురాలినని, బంగారం, నగదు, బ్యాంకు డిపాజిట్లపై అధిక లాభాలు ఇప్పిస్తానని నమ్మించి పలువురిని ఆమె మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో డీకే సురేశ్ పేరును ఆమె దుర్వినియోగం చేసిందని ఆరోపణలు వచ్చాయి. సురేశ్కు తాను సోదరినని చెబుతూ మోసాలకు పాల్పడిందని ఫిర్యాదులు వచ్చాయి. గౌడ, ఆమె భర్త హరీష్ కెఎన్పై కూడా ఈడీ కేసులు నమోదు చేసింది.
డికె శివకుమార్ సోదరుడు సురేష్కు ఈడీ సమన్లు
- Advertisement -
- Advertisement -
- Advertisement -