Friday, August 15, 2025

ఎలక్ట్రిక్ స్కూటీ పేలి వృద్ధురాలు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా యర్రగుంట్లలో ఎలక్ట్రిక్ బైక్ పేలడంతో మహిళ చనిపోయింది. పోట్లదుర్తిలో స్కూటీకి ఛార్జింగ్ పెడుతుండగా అది పేలిపోయింది. పక్కనే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ(62) అనే వృద్ధురాలు మృతి చెందింది. ఎలక్ట్రిక్ స్కూటీలు రోడ్లపై షార్ సర్య్కూట్ తో పేలిపోయిన విషయం తెలిసిందే. ఛార్జింగ్ పెట్టడంతో ఎక్కడైనా తప్పిదం జరిగిందా? లేక ఎలక్ట్రిక్ వాహనాలలో లోపంతో పేలుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటివి జరిగినప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలపై కేసులు వేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.  స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News