Friday, June 27, 2025

గజరాజుల బీభత్సం.. జగన్నాథ రథయాత్రలో అపశృతి

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జగన్నాథ రథయాత్రలో (Jagannath Rathyatra) అపశృతి చోటు చేసుకుంది. ఊరేగింపుగా వచ్చిన మూడు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏనుగులు అదుపుతప్పి భక్తులపైకి దూసుకు వచ్చాయి. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రాణాలు కాపాడుకునేందుకు భక్తులు పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు. అయితే కొంత సమయానికి పరిస్థితి అదుపుకావడంతో మళ్లీ రథయాత్రను యథావిధిగా జరిపించారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 10.15 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. జగన్నాథ రథయాత్ర (Jagannath Rathyatra) అహ్మదాబాద్‌లోని ఖాదియా ప్రాంతం నుంచి వెళ్తుండగా.. ఏనుగులు అదుపు తప్పాయి. దీంతో కొంత సమయం గందరగోళ పరిస్థితి నెలకొంది. భారీ శబ్ధంలు రావడం వల్లే ఏనుగులు బెదిరి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News