Saturday, August 2, 2025

లంచ్ బ్రేక్.. ఆకాశ్ సూపర్.. సెంచరీకి చేరువలో జైస్వాల్

- Advertisement -
- Advertisement -

ఐదో చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాట్స్ మెన్స్ ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు రాబడుతున్నారు. మూడో రోజు ఆకాశ్ దీప్ తో కలిసి ఆట ప్రారంభించిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్ సెంచరీకి చేరువయ్యాడు. వీరిద్దరూ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా ఆకాశ్.. చక్కని షాట్లతో అలరించాడు. బౌండరీలతో చెలరేగిన ఆకాశ్ తొలి టెస్టు అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం 66 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన గిల్ కూడా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్ (11), జైస్వాల్ 85) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 166 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News