ఆగస్టు 14లోపు ప్రక్రియ
పూర్తి ఆన్లైన్లో బి
కేటగిరీ సీట్ల భర్తీపై ఇంకా
రాని స్పష్టత ఉన్నత
విద్యామండలి చైర్మన్
బాలకిష్టారెడ్డి వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్: జులై మొదటి వారంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఉంటుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఆగస్టు 14 లోపు ఇంజినీరిం గ్ తరగతులు నిర్వహించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఎఐసిటిఇ) సర్యులర్ జారీ చేసిందని, అందుకు అనుగుణంగా ఆ లోపే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తె లిపారు. గత ఏడాది కూడా జులై నెలలోనే ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభమైందని తె లిపారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో చైర్మన్ బాలకిష్టారెడ్డి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్పై స్పష్టత ఇచ్చారు. ఈ ఏ డాది ఎప్సెట్ పరీక్షలు ముందుగా నిర్వహించి ఫలితాలు వెల్లడించడం వల్ల విద్యార్థు లు, తల్లిదండ్రులు కౌన్సెలింగ్ గురించి ఆరా తీస్తున్నారని, ఈ ఏడాది కూడా సకాలంలోనే కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు. ఇంజనీరింగ్ బీ కేటగిరీ సీట్లు ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వానికి నివేదించామని, ఈ అంశంపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు.
గత ఏడాది జులై 31న బీ కేటగిరీ సీట్ల భర్తీ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ ఇచ్చిందని, ఈసారి కూడా ఆ లోపే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. తల్లిదండ్రులు అనవసరంగా బీ కేటగిరీ సీట్ల కోసం డబ్బు లు వృథా చేసుకోవద్దని సూచించారు. జెఇఇ కౌన్సెలింగ్ కాకుండా రాష్ట్రం లో కౌన్సెలింగ్ చేపట్టలేమని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు కౌ న్సెలింగ్కి సమయం ఉండటంతో కళాశాలల గురించి తెలుసుకోవాలని సూచించారు. ఈసారి అన్ని ప్రవేశ పరీక్షలు విజయవంతం నిర్వహించిన ట్లు పేర్కొన్నారు. సిలబస్ మార్పుపై దాదాపు కసరత్తు పూర్తయిందన్నారు.
జెఇఇ అడ్వాన్స్డ్ తరహాలో మాక్ కౌన్సెలింగ్
రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఈసారి జెఇఇ అడ్వాన్స్డ్ తరహాలో మాక్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి వెల్లడించారు. ఈ మాక్ కౌన్సెలింగ్ ద్వారా కళాశాలలు, బ్రాంచీల ఎంపికకు వెబ్ ఆప్షన్ల ఎంపిక చేసుకునే విధానంపై విద్యార్థులకు అవగాహన వస్తుందని చెప్పారు.మాక్ కౌన్సెలింగ్లో సీట్ల కేటాయింపు కూడా ఉంటుందని, దాంతో వెబ్ ఆప్షన్లు ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలపై విద్యార్థులు అవగాహన లభిస్తుందని తెలిపారు. దాంతో పాటు ఈ నెల మూడో వారంలో కూకట్పల్లిలోని జెఎన్టియుహెచ్లో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు.