- Advertisement -
టీమిండియాతో జరగనున్న ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్ట్ కోసం ఇంగ్లాండ్ తమ జట్టును ప్రకటించింది. గురువారం బెన్ స్టోక్స్ సారథ్యంలో 14 మంది సభ్యుల జట్టును వెల్లడించింది. ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్కు విశ్రాంతినిచ్చారు. గత నెలలో జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. మొదటి ఇన్నింగ్స్లో ఆరు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన తర్వాత అతను వాకౌట్ చేశాడు. జూన్ 20 నుండి లీడ్స్లోని హెడింగ్లీలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.
ఇంగ్లాండ్ జట్టు:
బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, జేమీ ఒవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్.
- Advertisement -