ప్రధాని నరేంద్రమోదీ పదకొండేళ్ళ పాలనలో దేశానికి గొప్పమార్పులను తీసుకువచ్చిందని మల్కాజ్గిరి ఎంపి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రదాని మోదీ పదకొండేళ్ల పాలన పూర్తి అయిన సందర్భంగా గురువారం శామీర్పేట్ ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎంపి ఈటల మాట్లాడుతూ ప్రధాని మోదీ ఈ 11 ఏళ్ల పరిపాలనలో జాతీయరహదారుల నిర్మాణం, రైల్వే, కొత్త విమానాశ్రయాలు ఏర్పాట్లు, నిరుద్యోగ పరిష్కారం, రక్షణ రంగం ఉత్పత్తులు పెంచడం లాంటి ఎన్నో విప్లవాత్మకమార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ప్రదాని నరేంద్రమోదీ అమలు కాని హామీలు ఇవ్వలేదని, మొదటి ఐదేళ్ల పాలనచూసి ఓట్లువేసి ఆశీర్వదించాలని మాత్రమే కోరారని తెలిపారు. ప్రపంచంలో ఉన్న అన్ని మిత్రదేశాలతో సత్సంబంధం నెలకొల్పడంలో, భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచనికి తెలియజేయటంలో ప్రదాని మోదీ నిర్వహించిన పాత్ర ఎంతో గొప్పదన్నారు.
ప్రధాని పదకొండేళ్లలో వినూత్న మార్పులు:ఎంపి ఈటల రాజేందర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -