Tuesday, June 24, 2025

బ్యాడ్ న్యూస్.. భారత మాజీ క్రికెటర్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్. భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి (Dilip Doshi) (77) సోమవారం కన్నుమూశారు. లండన్‌లో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 1979-1983 కాలంలో ఆయన భారత్ తరఫున 33 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. ఫస్ట్ క్లాస్‌‌లో 238 మ్యాచులు ఆడారు. టెస్టుల్లో 114, వన్డేల్లో 22, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 898 వికెట్లు తీశఆరు. ఇంగ్లండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో 102 పరుగులు ఇచ్చి 6 వికెట్లు, ఆస్ట్రేలియాతో 103 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసి.. తన కెరీర్‌లో బెస్ట్ ఫిగర్స్ సాధించారు. దిలీప్ మృతిపై బిసిసిఐ, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో, రవిశాస్త్రి, వివిఎస్ లక్ష్మణ్ సహా పాటు పలువురు క్రికెటర్లు, అభిమానులు సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News