- Advertisement -
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో పని చేసే వారికే పదవులు దక్కుతాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) తెలిపారు. పదవులపై కాంగ్రెస్ పార్టీలో హామీలు ఏమీ ఉండవు అని అన్నారు. హిమాయత్ నగర్ లో రూ.60 లక్షల రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రివర్గ విస్తరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం పాటిస్తూ మంత్రివర్గ విస్తరణ చేశారని తెలియజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, బిసిలకు ప్రాధాన్యత ఇచ్చారని, హైదరాబాద్ లో తనకు మంత్రి పదవి విషయంలో ఇంకా వేచి చూడాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయాలను సిఎం రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. 150 మందికి కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు దానం నాగేందర్ పంపిణీ చేశారు.
- Advertisement -