Sunday, June 1, 2025

మధురానగర్‌లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

ఎసి కంప్రెసర్ పేలడంతో అగ్నిప్రమాదం సంభవించిన సంఘటన హైదరాబాద్‌లోని మధురానగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. మధురానగర్‌లోని రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో ఎసి కంప్రెసర్ పేలిపోయింది. జి ప్లస్ 5 బిల్డింగ్ రెండో అంతస్థులోని ఎసి కంప్రెసర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో అపార్ట్‌మెంట్ ప్రాంతంలో పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి వేశారు.అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News