Sunday, June 29, 2025

వాళ్లకు ఓ నమస్కారం పెడతా: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: కొందరు ఎంతో పని చేస్తారు కానీ మంచి పేరు రాదని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎంత పని చేశామనే అంశంతో పాటు ఎలా చేస్తున్నామనేది కూడా కీలకం అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొందరు పెద్దగా పని చేయకున్నాప్రజల్లో మంచి పేరు ఉంటుందని చెప్పారు. ఇప్పుడు గెలిచిన వాళ్లు మళ్లీ మళ్లీ గెలవాలి అని ఆ దిశగా ఆలోచన చేస్తున్నానని, పార్టీలో ప్రతి ఒక్కరూ అదే తరహాలో ఆలోచన చేయాలని సూచించారు. ప్రజా ప్రతినిధులకు వారసత్వం ఉందని తాము పని చేయమంటే వారికి ఓ నమస్కారం పెడతానని హెచ్చరించారు.

ఎప్పటికప్పడు నేతల పనితీరుపై సమాచారం తెప్పించుకుంటున్నానని, అనేక మార్గాల ద్వారా సర్వేలు చేయిస్తున్నానని తెలియజేశారు. అన్నీ సర్వేలను విశ్లేషించి..(Analyze surveys)వాస్తవాలను బేరీజు వేస్తున్నానని, ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు. తాను చెప్పాల్సింది ఎమ్మెల్యేలకు చెబుతున్నానని, మారాల్సింది ఎమ్మెల్యేల పనితీరు అని సలహాలు ఇచ్చారు. పనితీరు మార్చుకుంటే బాగుంటుందని, లేకపోతే ఇక అంతే సంగతులు అని చంద్రబాబు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News