హైదరాబాద్: ఓ విద్యార్థినిని టీచర్ లైంగికంగా వేధించడంతో ఆమె కాలేజీ ఆవరణంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రం బాలాసోర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫకీర్ మోహన్ ఆటోనమస్ కాలేజీలో విద్యార్థిని సౌమ్యశ్రీ బిఎడ్ రెండో సంవత్సరం చదువుతోంది. హెచ్ఒడి సమీర్ కుమార్ సాహూ గత కొన్ని రోజుల నుంచి సౌమ్యను లైంగికంగా వేధిస్తున్నారు. అతడి వేధింపులు శృతిమించడంతో కాలేజీ ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్కు ఫిర్యాదు చేసింది. కానీ ప్రిన్సిపల్ సాహూపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె ఒత్తిడికి లోనైంది. సెక్సువల్గా ఫేవర్గా లేకపోతే విద్య పరంగా భవిష్యత్ను నాశనం చేస్తానని ఆమెను సాహూ బెదిరించాడు. దీంతో ప్రిన్సిపాల్ రూమ్ ముందు మూడు రోజుల క్రితం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. సహ విద్యార్థులు మంటలను ఆర్పేసి భువనేశ్వర్లోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 90 శాతం కాలిన గాయాలతో నుంచి చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం విద్యార్థిని కన్నుమూసింది. ప్రస్తుతం నిందితుడు సాహూను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ప్రిన్సిపాల్ రూమ్ ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న విద్యార్థిని మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -