Tuesday, September 16, 2025

నాలాలో మిస్సింగ్.. ఇంకా దొరకని ఆచూకీ.. కుటుంబసభ్యుల ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నగరాన్ని (Hyderabad) అతలాకుతలం చేశాయి. మూడు రోజుల క్రితం భారీ వర్షం కురియడంతో పలు ప్రాంతాల్లో రోడ్లన్ని జలమయమయ్యయి. ఈ క్రమంలో వాహనదారుడు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. అయితే అఫ్జల్‌సాగర్, వినోబానగర్‌లో ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా నాలాలు ఉప్పొంగాయి. ఈ క్రమంలో నాలాల్లో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు. గల్లంతైన అర్జున్, రాము, దినేష్‌లుగా గుర్తించారు. అయిుతే గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. డిఆర్ఎఫ్, జిహెఛ్‌ఎంసి అధికారులు ఆ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. అయితే అధికారులు గాలింపు చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధిత కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులైన తమవాళ్ల ఆచూకీ లభించకపోవడంపై ఆందోళన చెందుతున్నారు.

Also Read : భాగ్యనగరంలో భారీ వర్షం… ముగ్గురు గల్లంతు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News