మన తెలంగాణ/హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన గుగులో తు కిషన్ (51) అనే రైతు పంట కొనుగోలు కేంద్రం వద్ద వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పం దించిన కెటిఆర్ స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఓవైపు ముఖ్యమంత్రి అందాల పో టీల్లో మునిగితేలుతుంటే, మరోవైపు వడదెబ్బకు తాళలేక ఓ రైతు ధాన్యపు కుప్పలపైనే ప్రాణాలు విడిచిన దురదృష్టకర పరిస్థితి కనిపిస్తోందని, ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి, రుణమాఫీ పేరిట మోసం చేసి, చివరికి పండిన పంటను కొనక వదిలేయడం వల్లే రైతన్న అనాథలా మారారని, ఇది కేవలం నిర్వాకం కాదు.. ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఓవైపు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం అకాల వర్షాల్లో కండ్లముందే నాశనమవుతోందని, మరోవైపు మండుతున్న ఎండలను తట్టుకోలేక రైతులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దయనీయ పరిస్థితులకు పూర్తి బాధ్యత దద్దమ్మ కాంగ్రెస్ సర్కారుదే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో వారాల తరబడి పడిగాపులు పడుతున్నారని, కానీ పట్టించుకునే వాడు లేరని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా..? అనే సందేహం ప్రజల్లో పెరుగుతోందని వ్యాఖ్యానించారు. వడదెబ్బకు కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి బలైన గుగులోతు కిషన్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సిఎంకు సోయి ఉంటే, కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని, లేకపోతే రైతుల ఆగ్రహానికి ఈ కాంగ్రెస్ సర్కారు తట్టుకోలేని పరిస్థితికి చేరుకుంటుందని కెటిఆర్ హెచ్చరించారు.