Wednesday, June 25, 2025

జాడ లేని వాన.. వరుణుడి కరుణ కోసం రైతన్నల ఎదురు చూపులు

- Advertisement -
- Advertisement -

మురిపించిన ముందస్తు వర్షాలు.. తరువాత మాయం 
సకాలంలో రాని రుతు పవనాలు.. ఆందోళన చెందుతోన్న అన్నదాతలు
తేలికపాటి వానల కోసం రైతుల ఎదురు చూపు
వరి కేవలం 33 వేల ఎకరాల్లోనే సాగు

మన తెలంగాణ/హైదరాబాద్: వరుణిడి కరుణకోసం రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్నారు. వర్షకాలం ముందు మురిపించి భవిష్యత్తుపై మరిన్ని ఆశలు రేకిత్తించింది. రైతులు ముందస్తు వర్షలు కురువడంతో సాగుకు సిద్దమయ్యారు. భూములను చదును చేసి క్కులు దున్ని విత్తులు వేశారు. ముందు మురిపించిన వర్షం ఆపై మిన్నకుండి పోయింది. దీంతో పంట చేలో మొలకలకు బదులుగా రైతుల గుండెల్లో కరువు రక్కసి కాటేస్తుందన్న భయం పరుగెడుతోంది. పంటల సాగుల కోసం అప్పులు తెచ్చి మొక్కలకు ప్రాణం పోశారు. ఆ మొక్కల ప్రాణం వర్ష చినుకులతో చిగురించాలని ఆశగా వానదేవుడా..కరుణించరా అంటూ గ్రామాల్లో గ్రామా దేవుళ్ళలకు ప్రత్యేక పూజలు చేస్తూ ఆకాశం వైపు దినంగా చూస్తున్నారు. వానాకాలం సాగు ఇంకా పుంజుకోలేదు. వాస్తవానికి మే నెలలోనే ముందస్తు నైరుతి రుతుపవనాల రాకతో మురిసిపోయిన రైతులు.. అప్పుడు కురిసిన వర్షాలకు పత్తి, మక్కలు, జొన్నలు సాగు చేశారు. ఆపై వరుణుడి జాడ లేకపోవడంతో కొన్నిచోట్ల విత్తనాలు మొలకెత్తక, మరికొన్ని చోట్ల ఎండిపోయాయి. రెండురోజులుగా కురుస్తున్న తేలకపాటి వర్షాలతో రైతులు మళ్లీ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. బావులు, బోర్ల కింద చాలా చోట్ల నార్లు పోసి, దుక్కులు దున్ని పొలాలను సి ద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కేవలం 33 వేల ఎకరాల్లో వరి సాగైంది.

కాలువలు, చెరువులు, ప్రాజెక్టుల నుంచి సాగునీటి లభ్యత, నీటి విడుదలపై స్పష్టత రాకపోవడం, వర్షాలు కూడా సరిగ్గా లేకపోవడంతో మెజారిటీ చోట్ల దుక్కులు దు న్నడం లేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. రుతుపవనాలు లేక, వరుణదేవుడు కరుణించక వానాకాలం (ఖరీఫ్) పంటల సాగు ప్రశ్నార్ధకం గా మారుతోంది. రోహిణి కార్తె ప్రారంభంలో 15 రోజుల క్రితం ఒకటి రెండు రోజులు రుతు పవనాల ప్ర భావంతో పలకరించినప్పటికీ తర్వాత వర్షాలు కురిసిన పరిస్థితి లేకపోవడంతో రైతులు విత్తనాలు వేయలే క పోయారు. నీటి వనరులు, బోరుబావులు, బావుల కింద వరి నార్లు పోసుకున్నప్పటికీ మెట్ట పంటలు వే సేందుకు అనుకూలత లేక పోవడంతో రైతన్నల ఆశ లు ఆవిరవుతున్నాయి. పంటల సాగు పరిస్థితి ఏంటనే ఆవేదన రైతుల్లో కనిపిస్తోంది. కోటి ఆశలతో వ్యవసాయానికి శ్రీకారం చుట్టి న రైతన్నకు సరైన సమయంలో వర్షాలు పడక పోవడంతో అందోళన చెందుతున్నారు. ఈ వానాకాలంలో కోటి 35 లక్షల ఎకరా ల్లో వివిధ పంటలు సాగు చేస్తారని ప్రభుత్వం అం చనా వేసింది. అయితే ఇప్పటి వ రకు కేవలం 20 లక్ష ల ఎకరాల్లో లోపే వివిధ పం టలు సాగయ్యాయి. గత ఏడాది ఈ సమయంతో పోలిస్తే ఆరు లక్షల విస్తీర్ణం తక్కువగా ఉందని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News