లక్నో: పక్కింట్లో ఇద్దరు వ్యక్తులు 16 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేయడంతో బాలిక విషం తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఫతేబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ గ్రామంలో 16 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులకు కలిసి ఉంటుంది. పక్కింట్లో ఉండే ఓ మహిళ తన ఇంటికి తీసుకెళ్లి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చింది. సదరు మహిళ మేనల్లుడు, మరోక వ్యక్తి బాలికపై అత్యాచారం చేశారు. అనంతరం ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. జూన్ 18న కడుపులో నొప్పితో పాటు వాంతులు అవుతున్నాయని బాలిక తన తల్లికి చెప్పింది. పక్కింట్లో ఉండే వ్యక్తి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని చెప్పింది. విషం తాగానని చెప్పడంతో వెంటనే బాలికను మహారాజ అగ్రసేన్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.
16 ఏళ్ల బాలికపై ఇద్దరు అత్యాచారం… ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
- Advertisement -