Wednesday, June 18, 2025

మృతశిశువును క్యారీ బ్యాగ్ లో పెట్టుకొని బస్సులో 90 కిలో మీటర్లు ప్రయాణించాడు…

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్ సమకూర్చకపోవడంతో మృతి శిశువును క్యారీ బ్యాగ్‌లో పెట్టుకొని 90 కిలో మీటర్లు ప్రయాణించాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగింది. దీనికి సంబందించిన వార్త అలస్యంగా వెలుగులోకి వచ్చింది. జోగల్ వాడీ తండాలో సాఖారామ్ కవడ్, అవిత అనే భార్యభర్తలు నివసిస్తున్నారు. అవితకు పురిటి నొప్పులు రావడంతో ఖొడొలా ప్రజా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. గంట సేపు నిరీక్షించిన తరువాత గర్భవతిని మొకఖ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సిబ్బంది తెలిపారు. మొకఖ ఆస్పత్రి సిబ్బంది ఆమెను పరీక్షించి నాసిక్ సివిల్ ఆస్పత్రి తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. అర్థరాత్రి 1.30కు మృత శిశువు జన్మించిందని దంపతులకు వైద్య సిబ్బంది తెలిపారు.

మృతశిశువును తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వాలని ఆస్పత్రి సిబ్బందిని సాఖారామ్ అడిగాడు. వాళ్ల తిరస్కరించడంతో మృతశిశువును క్యారీ బ్యాగ్‌లో కట్టి అనంతరం బ్యాగ్‌లోపెట్టుకొని టిఎస్‌ఆర్‌టిసి బస్సులో తన గ్రామానికి 90 కిలో మీటర్లు ప్రయాణించాడు. తన బంధువుల సమక్షంలో మృతశిశువును ఖననం చేశాడు. మరుసటి రోజు భార్య వద్దకు వచ్చాడు. ఈ విషయం మీడియాకు తెలియడంతో సాఖారామ్ వాదనను నాసిక్ ఆస్పత్రి సిబ్బంది ఖండించారు. తమకు సమాచారం ఇవ్వకుండానే మృతి శిశువును తీసుకెళ్లాడని ఆస్పత్రి అధికారులు ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News