Monday, September 15, 2025

ఫీ రీయింబర్స్ మెంట్ లో కాంగ్రెసోళ్లకు 20 శాతం కమీషన్లు: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆడబిడ్డల చదువులను కాంగ్రెస్ కమీషన్ల సర్కారు కాలరాస్తోందని ఎంఎల్ సి కవిత మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా ఫీ రీయింబర్స్ మెంట్ బకాయిలను తెలంగాణ ప్రభుత్వం ఎగవేస్తుందని దుయ్యబట్టారు. సోమవారం ఆమె తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 20 శాతం కమీషన్లు ఇస్తేనే రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇస్తామని ప్రభుత్వంలోని కొందరు డిమాండ్ చేస్తున్నారని… దీంతో కాలేజీల యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నాయని ఆరోపణలు చేశారు. కమీషన్ల కోసమే బకాయిలు ఏళ్లకేళ్లుగా పెండింగ్ లో పెట్టారని, ఇప్పటికే కాలేజీలు నడపలేక యాజమాన్యాలు ఆర్థికంగా చితికిపోయాయని వివరించారు. కాలేజీలు మూతపడితే చదువుకు ఆడబిడ్డలు దూరం కానున్నారని ఆవేదని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని గప్పాలు కొట్టి ఆడబిడ్డలను చదువులకు దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Also Read:  నో షేక్‌హ్యాండ్.. పాకిస్తాన్ కు భారత్ షాక్(వీడియో)

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News