Monday, September 15, 2025

సినిమాల చిత్రీకరణ మరింత సులభతరం: దిల్ రాజు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో సినిమాల తయారీ ఇక సులభతరమని రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ(ఎఫ్‌డిసి) చైర్మన్ దిల్ రాజు అన్నారు. సినిమాల చిత్రీకరణ, సినిమాల చిత్రీకరణలకు కావాల్సిన అన్ని అనుమతులు, సినిమా థియేటర్ ల నిర్వహణకు పొందాల్సిన అనుమతులు, సినీ రంగాభివృద్దికి కావాల్సిన అనుమతులు అన్నీ సింగిల్ విండో ద్వారా పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ రూపొందిస్తోందని ఆయన వెల్లడించారు. సినిమా అనుమంతులపై రూపొందిస్తున్న ప్రత్యేక వెబ్ సైట్ ’ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ‘ పై నేడు సంబంధిత శాఖలు, ఫిలిం ఇండస్ట్రీ ప్రతినిధులతో సోమవారం ప్రత్యేక వర్క్-షాప్ నిర్వహించారు. బేగంపేట్ లోని టూరిజం ప్లాజా లో జరిగిన ఈ వర్క్ షాప్ కు రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ(ఎఫ్‌డిసి) చైర్మన్ దిల్ రాజు, ఎఫ్‌డిసి మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్ ప్రియాంక,

పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, రాష్ట్ర చలన చిత్ర పరిశ్రమ ప్రతినిధులు హాజరయ్యారు. ఈసందర్బంగా ఎఫ్‌డిసి చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్ని రకాలుగా చేయూత నందిస్తున్నారని తెలిపారు. ఈ సదావకాశాన్ని సినీ పరిశ్రమ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సినీ నిర్మాతలు కేవలం స్క్రిప్ట్ తో వస్తే వారి సినిమా నిర్మాణానికి కావాల్సిన షూటింగ్ లొకేషన్లు, వారికి వివిధ ప్రభుత్వ శాఖలనుంచి కావాల్సిన అనుమతులు, సినీ నిర్మాణానికి సంబందించించిన సాంకేతిక విభాగాలు, టెక్నీషియన్లు, హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో అందుబాటులో ఉన్న హోటళ్ల సంపూర్ణ సమాచారంతో ఈ వెబ్ సైట్ రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇలాంటి సౌలభ్యం మొట్టమొదటిసారిగా తెలంగాణలో మాత్రమే రూపొందిస్తున్నట్లు చైర్మన్ దిల్ రాజు చెప్పారు.

అంతే కాకుండా సినిమా థియేటర్ల నిర్వహణకు కావాల్సిన బీ-ఫామ్ జారీ విధానాన్ని కూడా ఆన్ లైన్ ద్వారా పొందే సులభతరం విధానాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. సినిమా థియేటర్ల నిర్వహణకు ఇప్పటివరకు నగరాల్లో అయితే సంబంధిత పోలీసు కమీషనర్లు, జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఆయా జిల్లాల అడిషనల్ కలెక్టర్లు జారీ చేసే అవకాశం ఉందన్నారు. ఇకపై ఇలాంటి అనుమతులు ఈన్నీ కూడా ఆన్ లైన్ విధానం ద్వారా అమలుచేయడానికి రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖతో చర్చించి విధి విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ వెబ్-సైట్ రూపకల్పన కు సంబంధించి తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని చలన చిత్ర పరిశ్రమ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులను ఆయన కోరారు. ఈ వెబ్ సైట్ ను పూర్తి స్థాయిలో రూపొందించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి లతో ఆవిష్కరింపజేస్తామన్నారు.

Also Read: బండి సంజయ్‌పై పది కోట్ల పరువు నష్టం దావా వేసిన కెటిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News