Sunday, June 8, 2025

శ్మశానవాటిక నుంచి ఎగిసిపడిన నిప్పురవ్వలు

- Advertisement -
- Advertisement -

జిల్లాలోని జగిత్యాల అర్బన్ మండలం, ధరూర్‌లో కరీంనగర్ ప్రధాన రహదారి పక్కన శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలు చనిపోగా ఆమె మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేస్తున్న క్రమంలో నిప్పురవ్వలు ఎగిసిపడి పక్కనే ఉన్న స్క్రాప్ దుకాణానికి మంటలు అంటుకున్నాయి. ఈ దుకాణంలో చెత్త, ప్లాస్టిక్ పాత సామగ్రి ఉండడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ధరూర్ గ్రామమంతా పొగ అలుముకుంది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది గంటన్నరకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. పక్కనే ఇండ్లు, పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది రెండు వాహనాలతో మంటలను అదుపులోకి తేవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం వల్ల రూ.5 లక్షలకు పైగా నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News