Wednesday, June 18, 2025

టి20 సిరీస్‌లో అరుదైన రికార్డు

- Advertisement -
- Advertisement -

స్కాట్లాండ్ వేదికగా జరుగుతున్న ముక్కోణపు టి20 సిరీస్‌లో అరుదైన రికార్డు నమోదైంది. నేపాల్, నెదర్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫలితం కోసం మూడు సూపర్ ఓవర్లు అనివార్యమయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. విక్రమ్‌జీత్ సింగ్ (30), తేజ నిడమనూరు (35), సఖిబ్ జుల్ఫికర్ 25 (నాటౌట్) జట్టును ఆదుకున్నారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఇక ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ ఓవర్‌లో ఇరు జట్లూ చెరో 19 పరుగులు చేశాయి. దీంతో మరో సూపర్ ఓవర్ నిర్వహించక తప్పలేదు.

ఇందులో కూడా ఇరు జట్లు చెరో 17 పరుగులు సాధించాయి. ఈ పరిస్థితుల్లో ఫలితాన్ని తేల్చేందుకు మూడో సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. కానీ ఈసారి నెదర్లాండ్స్ పైచేయి సాధించింది. లయన్ కాచెట్ ఒక్క పరుగు ఇవ్వకుండానే రెండు వికెట్లను పడగొట్టాడు. ఇక తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్ సిక్స్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. కాగా, టి20 చరిత్రలో ఓ మ్యాచ్‌లో ఫలితం కోసం మూడు సూపర్ ఓవర్‌లను నిర్వహించడం ఇదే తొలిసారి. గతంలో చాలా రెండు సూపర్ ఓవర్‌లలో ఫలితం తేలింది. కానీ నెదర్లాండ్స్, డచ్ మ్యాచ్‌లో మాత్రం మూడో సూపర్ ఓవర్‌లో ఫలితం వచ్చింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఈ మ్యాచ్ చిరకాలం గుర్తుండి పోవడం ఖాయం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News