- Advertisement -
హైదరాబాద్లో చేప మందు పంపిణీ కార్యక్రమం ఆదివారం ప్రారంభం కానుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇప్పటికే చేప మందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ చేప మందు పంపిణీని ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా ఆస్తమా బాధితులు వచ్చారు. 42 క్యూలైన్ కౌంటర్లలో చేప మందు పంపిణీ జరగనుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు, రేపు రెండు రోజులు బత్తిని సోదరులు చేప మందు పంపిణీ చేయనున్నారు.
- Advertisement -