Friday, June 27, 2025

హిమాచల్‌లో ఆకస్మిక వరదలు: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలోని ఒక జల విద్తుత్ ప్రాజెక్టు స్థలం నుండి మరో రెండు మృత దేహాలను వెలికితీశారు. బుధవారం ఆకస్మిక వరదల కారణంగా ఈ మృతదేహాలు కొట్టుకువచ్చాయి. దీంతో ప్రస్తుతానికి మృతుల సంఖ్య నాలుగుకు పెరిగిందని అధికారులు గురువారం తెలిపారు. రెండు మృతదేహాలను బుధవారం స్వాధీనం చేసుకోగా, మిగతా రెండు మృతదేహాలను గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని కాంగ్రా అదనపు డిప్యూటీ మెజిస్ట్రేట్ శిల్ప బెక్తా తెలిపారు. మృతులను చెయిన్ సింగ్(జమ్మూకశ్మీర్), ఆదిత్య ఠాకుర్(చంబ), ప్రదీప్ వర్మ(యుపి), చందన్(యుపి)గా గుర్తించామని కాంగ్రా పోలీస్ సూపరింటెండెంట్ శాలిని అగ్నిహోత్రి గురువారం వివరించారు.

గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఆకస్మిక వరదల కారణంగా గల్లంతైన ఏడుగురి ఆచూకీ ఇంకా లభించలేదు. కాంగ్రా, కులూ జిల్లాల్లో బుధవారం సంభవించిన కుంభవృష్టి కారణంగా ఆకస్మిక వరదలు వచ్చాయి. గాలింపు బృందాలు లవ్లీ అనే వ్యక్తిని ప్రాజెక్టు ఉన్న అటవీ ప్రాంతంలో రక్షించారు. వరదల్లో కొట్టుపోయే వారిని గుర్తించే పనిలో ఉన్నామని జాతీయ విపత్తు ప్రతిస్పందన బలగం(ఎన్‌డిఆర్‌ఎఫ్) కమాండెంట్ బల్జీందర్ సింగ్ తెలిపారు. మనాలీ, బంజర్‌లలో కూడా ఆకస్మిక వరదలు వచ్చాయని సమాచారం. బంజర్ ఎంఎల్‌ఎ సురేందర్ శౌరీ ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News