త్వరలో దుర్గం చేరువుపై సమీక్ష
మనతెలంగాణ, సిటీబ్యూరో: మాధాపూర్లోని వరద ముప్పు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సోమవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నాలాల్లో వరద సాఫీగా సాగుతుందా . ఎక్కడైనా ఆటంకాలున్నాయా అనే అంశాలను పరిశీలించారు. వర్షం పడితే నీట మునుగుతున్న నెక్టార్ గార్డెన్స్ పరిసరాలలో వర్షపు నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ ఎంసీ, ఇరిగేషన్, జలమండలి అధికారులతో చర్చించారు.
దుర్గం చెరువుకు ఎండాకాలంలో కూడా నీటి కొరత వుండదు కనుక.. వర్షాకాలంలో నీటి నిలువల స్థాయిని తగ్గిస్తే వరద పోటెత్తదని అధికారులు సూచించారు. వర్షం పడితే నడుములోతు నీళ్లు తమ కాలనీలో నిలబడుతున్నాయని స్థానికులు కమిషనర్ కు విన్నవించారు. దుర్గం చెరువుకు ఇన్ ఫ్లో , ఔట్ఫ్లో ఎంతనే అంశాలను చెరువు చుట్టూ తిరిగి పరిశీలించారు. చెరువులోప్ల తూములను, గేటులలను తిలకించారు. ఇందులో ఏ గేటు ఎత్తితే ఎంత నీరు వెళ్తుంది.. అనే అంశాల్ను అడిగి తెలుసుకున్నారు.
దుర్గం చెరువుపై త్వరలో సమీక్ష…
దుర్గం చెరువులో నీటిమట్టం నిర్థారణకు ఇరిగేషన్, జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. వరద కాలువులను విస్తరించాల్సిన అవసరం ఉన్నా.. వర్షాకాలంలో అయినా కొంతమేర తగ్గిస్తే మాదాపూర్ ప్రాంతంలో వరద ముప్పు తిగ్గించడానికి వీలవుతుందా అనే విషయంపైై ఇందులో చర్చించనున్నారు.
దుర్గం చెరువు దిగువ భాగంలో ఆక్రమణలతోపాటు.. వరద కాలువుకు ఉన్న ఆటంకాలను కూడా కమిషనర్ పరిశీలించారు. దుర్గం చెరువులో ఇనార్బిట్ మాల్ వైపు మట్టి పోయడంపై విచారించారు. అక్కడ పార్కు చేసిన వాహనాలకు సంబంధించి వాకబు చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. దుర్గం చెరువు వరద కాలువకు ఆటంకం లేకుండా ఎంత మొత్తం నీరు విడుదల చేసినా సాఫీగా మల్కం చెరువుకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు.