- Advertisement -
అమరావతి: కడపలో జరుగుతున్న టిడిపి మహానాడులో మాజీ ఎమ్మెల్యే జలీలాఖాన్ అస్వస్థతకు గురయ్యారు. వేదికపై ఆయన ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. దీంతో శ్రేణులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. జలీలాఖాన్ 1999లో భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంఎల్ఎగా గెలిచారు. 2014లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో వైసిపి తరఫున ఎంఎల్ఎగా గెలుపొందారు. రాజకీయ సమీకరణ నేపథ్యంలో 2016లో టిడిపి చేరారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా కూడా వ్యవహరించారు.
- Advertisement -