విశాఖపట్నం: టాటా మెమోరియల్ సెంటర్తో (టీఎంసీ) కలిసి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (HBCHRC)లో కొత్త భవంతి నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. సుమారు 3.9 లక్షల చ.అ. విస్తీర్ణంలో, అత్యుత్తమ మెడికల్ టెక్నాలజీతో ఏర్పాటయ్యే ఈ అధునాతన కేంద్రం నిర్మాణానికి రూ. 550 కోట్ల పైగా మొత్తానికి కమిట్మెంట్తో ఐసీఐసీఐ బ్యాంకు నిధులను సమకూరుస్తోంది.
ఎనిమిది అంతస్తుల ఐసీఐసీఐ ఫౌండేషన్ బ్లాక్ ఫర్ చైల్డ్ అండ్ బ్లడ్ క్యాన్సర్ కొత్త బిల్డింగ్ అందుబాటులోకి వచ్చాక ఏటా 3,000 మంది పేషంట్లకు సేవలందించేందుకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం విశాఖపట్నంలోని HBCHRC వార్షిక సామర్థ్యం 6,200 పేషంట్లుగా ఉంది. తూర్పు భారతదేశంలోనే అత్యుత్తమ స్పెషలైజ్డ్ క్యాన్సర్ చికిత్సా కేంద్రాల్లో ఒకటిగా నిల్చేలా రూపొందిస్తున్న ఈ కొత్త భవనంలో 215 పైగా పడకలు ఉంటాయి. అన్ని అనుమతులకు లోబడి 2027 నాటికి ఇది పూర్తవుతుందని అంచనా. ఐసీఐసీఐ బ్యాంక్ సీఎస్ఆర్ విభాగమైన ఐసీఐసీఐ ఫౌండేషన్ ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్ దీన్ని అమలును పర్యవేక్షిస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ Mr. సందీప్ బాత్రా, టాటా మెమోరియల్ సెంటర్ (ముంబై) డైరెక్టర్ Dr. సుదీప్ గుప్తా సమక్షంలో ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ Mr. ప్రదీప్ కుమార్ సిన్హా కొత్త భవనం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇతర ప్రముఖుల సమక్షంలో N.K. రావు ఆడిటోరియంను కూడా Mr. సిన్హా ప్రారంభించారు. కొత్త ఆడిటోరియంనకు మౌలిక సదుపాయాలు, ఎక్విప్మెంట్పరంగా TMCకి ఐసీఐసీఐ ఫౌండేషన్ సహాయ సహకారాలు అందించింది.
“దేశీయంగా కీలక ఆరోగ్యసంరక్షణ మౌలిక సదుపాయాలను పటిష్టపర్చాలన్న మా లక్ష్యానికి అనుగుణంగా క్యాన్సర్ కేర్ విషయంలో TMCతో చేతులు కలపడం మాకు ఎంతో గర్వకారణమైన విషయం. అవసరార్ధులకు అత్యంత నాణ్యమైన వైద్య సంరక్షణను అందుబాటులోకి తేవాలన్న మా నిబద్ధతకు ఈ ప్రాజెక్టు నిదర్శనంగా నిలుస్తుంది. తూర్పు కారిడార్లో శిశు మరియు రక్త క్యాన్సర్కి సంబంధించి అతి పెద్ద ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, సమీపాన ఉన్న తూర్పు రాష్ట్రాల్లోని పేషంట్లకు సేవలందించేందుకు ఉపయోగపడుతుంది. పెరుగుతున్న క్యాన్సర్ చికిత్స అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది” అని ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ Mr. ప్రదీప్ కుమార్ సిన్హా తెలిపారు.
“సీఎస్ఆర్ కార్యకలాపాలకు సంబంధించి ఆరోగ్య సంరక్షణపై ఐసీఐసీఐ బ్యాంక్ ప్రత్యేక దృష్టి పెడుతుంది. విశాఖపట్నం, నవీ ముంబై, న్యూ చండీగఢ్లో కొత్తగా మూడు TMC కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రూ. 1,200 కోట్లు హామీనివ్వడం ద్వారా భారత్లో క్యాన్సర్ కేర్కి సంబంధించి విశిష్ట సేవలు అందిస్తున్న TMCతో రెండేళ్ల క్రితం జట్టు కట్టాం. TMC తాజా అవసరాల దృష్ట్యా ఈ మొత్తాన్ని రూ. 1,800 కోట్లకు పెంచుతున్నట్లు తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. 10.7 లక్షల చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ కొత్త బ్లాక్లలో అధునాతన వైద్య సదుపాయాలు, పరిశోధన విభాగాలు ఉంటాయి. ఈ బ్లాకుల్లో మొత్తం 19 LINACలు* మరియు 555 పడకలు ఉంటాయి. ఇవి పూర్తిగా అందుబాటులోకి వస్తే, ప్రాంతీయ హబ్లుగా పని చేస్తాయి” అని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ Mr. సందీప్ బాత్రా తెలిపారు.
“ఐసీఐసీఐ ఫౌండేషన్ ఉదారతకు ధన్యవాదాలు. ప్రాంతీయంగా పీడియాట్రిక్, హెమటోలింఫాయిడ్ క్యాన్సర్ల చికిత్స మరియు పరిశోధన పురోగతికి ఇది గణనీయంగా దోహదపడుతుంది. దేశవ్యాప్తంగా క్యాన్సర్ పేషంట్లకు అత్యుత్తమ చికిత్సను అందించేందుకు, మెరుగైన ఫలితాలను సాధించేందుకు మా సంస్థలు సమిష్టిగా చేస్తున్న కృషికి ఐసీఐసీఐ ఫౌండేషన్తో భాగస్వామ్యం నిదర్శనంగా నిలుస్తుంది” అని విశాఖపట్నంలోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ Dr. ఉమేష్ మహంత్శెట్టి (Dr. Umesh Mahantshetty) తెలిపారు.
“పీడియాట్రిక్ & హెమటోలింఫాయిడ్ క్యాన్సర్లకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మదింపు, చికిత్స, అలాగే బ్లడ్ సెంటర్, పౌష్టికాహారం, పునరావాసంలాంటి సపోర్ట్ సర్వీసులు, నైపుణ్యాలపరంగా ప్రత్యేక సంరక్షణ అవసరమవుతుంది. విశాఖపట్నంలోని HBCHRCలో గత మూడేళ్లుగా రోజూ కొత్తగా సుమారు 200 మంది పీడియాట్రిక్ క్యాన్సర్ పేషంట్లు, 350-400 మంది హెమటోలింఫాయిడ్ క్యాన్సర్ పేషంట్లు నమోదవుతున్నారు. ఎముక మూలుగు ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాంతో పాటు ప్రస్తుత సర్వీసులను గణనీయంగా విస్తరించేందుకు, అలాగే ఇమ్యూనోథెరపీని కూడా ప్రారంభించేందుకు ఈ కొత్త బ్లాక్ సహాయకరంగా ఉంటుంది. ప్రాంతీయంగా పేషంట్లకు సంబంధించి పరిశోధనలను చేపట్టేందుకు కూడా గణనీయంగా అవకాశం లభిస్తుంది” అని ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ ప్రొఫెసర్ & హెడ్ Dr. గిరీశ్ చిన్నస్వామి తెలిపారు.
ఐసీఐసీఐ బ్యాంక్ అందించనున్న రూ. 1,800 కోట్ల విరాళంలో విశాఖపట్నం ఆస్పత్రికి అందించే రూ. 550 కోట్ల మొత్తం భాగంగా ఉంటుంది.
విశాఖపట్నంలోని ఐసీఐసీఐ ఫౌండేషన్ చైల్డ్ అండ్ బ్లడ్ క్యాన్సర్ బ్లాక్లో ఈ కింది సమగ్ర చికిత్స సేవలు అందుబాటులో ఉంటాయి:
· ఇంటెన్సివ్ కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, అధునాతన రేడియేషన్ థెరపీ
· CAR-T సెల్ థెరపీలాంటి అధునాతన ఇమ్యునోథెరపీలు
· మూడు LINACలు*, MRI మరియు CVT-PET స్కాన్లతో పాటు అత్యంత ఆధునిక మెడికల్ ఇమేజింగ్, డయాగ్నోస్టిక్స్
· 14 BMT (బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్) గదులు, 14 ICUలు, 5 ఆపరేటింగ్ థియేటర్లు
· పరిశోధనల కోసం ప్రయోగశాలలు, చికిత్స ప్లానింగ్ మరియు శిక్షణ కోసం జాయింట్ డిస్కషన్ కేంద్రాలు
· లీనియర్ యాక్సిలరేటర్లు (LINACలు) రేడియేషన్ను పూర్తి కచ్చితత్వంతో కేవలం క్యాన్సర్ కణాలకే పరిమితం చేయడం ద్వారా వాటి పక్కన ఉండే ఆరోగ్యకరమైన టిష్యూలకు హాని కలగకుండా చూస్తాయి.