Sunday, June 15, 2025

మధ్యప్రదేశ్ బాలాఘాట్ లో ఎన్ కౌంటర్..నలుగురు నక్సలైట్లు మృతి

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా అటవీప్రాంతంలో శనివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మహిళలతో సహా నలుగురు నక్సలైట్లు చనిపోయారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంనుంచి ఓ గ్రెనేడ్ లాంచర్, ఒక సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (ఎస్‌ఎల్ ఆర్) రెండు .315బోర్ రైఫిల్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఎం తెలిపారు.ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో మధ్యప్రదేశ్ లో 2026 మార్చిలోగా

నక్సలిజాన్ని తుడిచిపెడతామని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో పేర్కొన్నారు. పచ్మదార్, కటేజిరియా అడవుల్లో హాక్స్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ ఫోర్స్, సీఆర్ పిఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మహిళా నక్సలైట్లతో సహా నలుగురు హతమయ్యారని ఆయన తెలిపారు.ఆ ప్రాంతంలో ఇంకా పోలీసులు, జవాన్లు నక్సల్స్  కోసం గాలిస్తున్నారని తెలిపారు. మరణించిన నక్సల్స్ ను గుర్తించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బాలాఘాట్ జిల్లా పోలీసు ఐజీ సంజయ్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News