Sunday, July 13, 2025

ఢిల్లీలో కూలిన నాలుగంతస్తుల భవనం.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ ప్రాంతంలో శనివారం ఉదయం నాలుగు అంతస్తుల భవనం కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఏడాది వయసున్న శిశువు సహా ఎనిమిది మంది గాయపడ్డారు, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. కూలిపోయిన భవనం యజమాని, ఆయన భార్య మృతదేహాలను శిథిలాల నుండి వెలికితీసి జిటిబి ఆసుపత్రికి పంపినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఎనిమిది మందిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు, శిథిలాల్లో చిక్కుకున్న ఇతరులను రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలకు ఎన్‌డిఆర్‌ఎఫ్ సహా అనేక ఏజెన్సీలను మోహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News