బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ (Nara Rohith) హీరోలుగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం. సమ్మర్ బిగ్గెస్ట్ ఎట్రాక్షన్గా మే 30న థియేటర్లలో విడుదల కానుంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆరట్స్ బ్యానర్పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ అధినేత డా.జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది, విడుదలైన తొలి రెండు పాటలు చార్ట్బస్టర్లుగా నిలిచాయి.
తాజాగా మేకర్స్ మూడవ సింగిల్ ’డుమ్ డుమారే’ ని విడుదల చేశారు, ఇది స్నేహానికి అంకితంగా ఉన్న ఒక వైబ్రెంట్ సాంగ్. కలర్ ఫుల్ కార్నివల్ నేపథ్యాన్ని కళ్లకు కట్టించిన ఈ సాంగ్, చిత్రంలో ముగ్గురు హీరోల మధ్య ఉన్న స్నేహాన్ని అద్భుతంగా చూపిస్తోంది. శ్రీ చరణ్ పాకాల లైవ్లీ బీట్లతో కూడిన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో హీరోయిన్స్గా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై నటిస్తున్నారు.