కడప: జిల్లా నాయకత్వమంతా కలిసి పనిచేసి మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. మహానాడు కార్యక్రమం అద్భుతంగా జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ..విజయవంతం చేసిన నేతలకు అభినందనలు, కార్యకర్తలకు హ్యాట్సాఫ్ అని తెలియజేశారు. సమిష్టిగా చేస్తే ఏదైనా సాధ్యమని మహానాడు (Mahanadu) తో నిరూపితమైందని, మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేసి స్ఫూర్తినిచ్చారని అన్నారు. మహానాడులో ప్రవేశపెట్టిన ఆరు శాసనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నామని పేర్కన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనపై ప్రజల్లో సానుకూలత ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలు కూడా విధిగా పేదల సేవలో పాల్గొనాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా సంక్షేమ క్యాలెండర్ ను ప్రకటిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
సమిష్టిగా చేస్తే ఏదైనా సాధ్యమని మహానాడుతో నిరూపితమైంది: చంద్రబాబు
- Advertisement -
- Advertisement -
- Advertisement -