- Advertisement -
ముంబయి: మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మందు గుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.
- Advertisement -