Monday, June 16, 2025

గద్దర్ అవార్డును మరో నంది అవార్డుగా మార్చేశారా ? : ప్రొఫెసర్ కంచ ఐలయ్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : గద్దర్ అవార్డుల ప్రెజెంటేషన్ సినిమా నటుల, రాజకీయ నాయకుల వ్యవహారంగా మారిందని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. తెలంగాణ సంస్కృతిని భూస్వామ్య స్థితి నుంచి ప్రజాస్వామ్య రూపంలోకి మారడంలో గణనీయ పాత్ర పోషించి, ఆడి, పాడిన వందలాది మంది కళాకారులను, ప్రజా గాయకులను, పాటల రచయితలను తెలంగాణ ప్రభుత్వం మరచిపోవడం చాలా విచారకరమని ఆయనన్నారు.

గద్దర్ కు చాలా దగ్గరి మిత్రుడినైన నేను, గద్దర్ ను కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వమని ఒప్పించిన వాడినని అయినా తనకు కూడా గద్దర్ అవార్డుల ఫంక్షన్‌కు ఆహ్వానం రాలేదని, ఇలా చాలా మందికి రాలేదన్నారు. రాహుల్ గాంధీకి, తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానని. అందుకు ప్రతిగా దూషణలు, బెదిరింపులు ఎదుర్కొంటున్నానని కంచ ఐలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గద్దర్ పేరిట అవార్డు ప్రకటించడం ద్వారా తెలంగాణ కళలు, సంస్కృతిలో కొత్త విప్లవం మొదలవుతుందని భావించానన్న ఆయన ఇప్పుడు సినిమా రంగాన్ని ఏయే కులాలు ఆధిపత్యం చేస్తున్నాయో, ఎవరు పెత్తనం చేస్తున్నారో మనకందరికీ తెలుసన్నారు. వారు తెలంగాణ ప్రజల సంస్కృతి పట్ల ఎలాంటి వైఖరితో ఉంటారో కూడా మనకు తెలుసని చెప్పారు. గద్దర్ అవార్డును మరో నందీ అవార్డుగా మార్చేశారా? అంటూ వ్యాఖ్యానించారు.

సినిమా అంటేనే డబ్బు కోసం అన్నట్లు ఉందని, ఇలా డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్న సినిమా సంస్కృతిని మార్చి, ఫూలే తరహా కొత్త తెలుగు సినిమా నిర్మాణ సంస్కృతిని తీసుకురావాలని గద్దర్ అవార్డు ద్వారా ఆశించామని ఐలయ్య అన్నారు. కాని అటువంటి కొత్త ప్రారంభం ఎక్కడా కనిపించలేదని, అవార్డు జ్యూరీలో ఒక్క జానపద కళాకారుడు కూడా లేడని, ఉన్న వారందరూ డబ్బు కోసం పనిచేసే సినిమా కళాకారులేనని తెలిపారు. ప్రజల కళలకు ప్రాతినిధ్యం ఎక్కడ? జ్యూరీలో గద్దర్ సాంస్కృతిక ప్రతినిధి ఎక్కడ ? గద్దర్ పాపులర్ పాట అయినా పొడుస్తున్న పొద్దుమీద అనే పాటకు ప్రాతినిధ్యం వహించే ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసి కళాకారులు ఎక్కడ? అని ఆయన ప్రశ్నించారు. గద్దర్ అంటేనే ప్రజా పాట అని, అవార్డు ప్రదానం చేసే సమయంలో అటువంటి ప్రజా పాటల, ప్రజా కళాకారులకు సంబంధించిన ప్రజా కళల ప్రతినిధులు ఎక్కడ? అంటూ నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News