- Advertisement -
14 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ పేరుతో సినీ నటీనటులకు అవార్డులను ప్రకటించింది. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఈ అవార్డుల వేడుక జరుగుతోంది. గద్దర్ అవార్డుల ప్రదానోత్సవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు హాజరయ్యారు. వీరిద్దరూ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అవార్డుల వేడుకకు సినీ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ హాజరయ్యారు. వీరితోపాటు సినీ ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా టాలీవుడ్ లో ఉత్తమ నటుడిగా మొదటి గద్దర్ అవార్డు అల్లుఅర్జున్ అందుకోనున్నారు. ప్రస్తుతం ఈ వేడుక వైభవంగా కొనసాగుతోంది.
- Advertisement -