Sunday, June 15, 2025

టిజిఎఫ్‌ఎ వేడుకను విజయవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -

కొంత విరామం తరువాత సినిమా నటీనటులను, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సాహించే సంప్రదాయ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుట్టింది. తెలంగాణ గద్ధర్ ఫిల్మ్ అవార్డ్ (టిజిఎఫ్‌ఎ)ను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024లో విడుదలైన ఉత్తమ చిత్రాలకు వాటిలో నటించి ఉత్తమ ప్రతిభను చూపిన నటీనటులకు, సాంకేతిక నిపుణులతో పాటు 2014 జూన్ నుండి 2024 డిసెంబర్ 31 వరకు సెన్సారు జరుపుకున్న చిత్రాల్లో కూడా ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి ఇందులో భాగంగా అవార్డ్స్ ఇవ్వనున్నారు. ఇటీవల విజేతల జాబితాను కూడా ప్రటించారు. కాగా ఈ అపూర్వ వేడుక కోసం హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.

శనివారం అంగరంగ వైభవంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. దాదాపు కొంత విరామం తరువాత ప్రభుత్వం అందిస్తున్న తెలంగాణ గద్దర్ అవార్డులు అందుకోవడం పట్ల అవార్డుల విజేతలు, తెలుగు సినిమా ప్రముఖులు, తెలుగు సినిమా ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రతిభను గుర్తించి తగు రీతిలో సత్కరించబోతున్న తెలంగాణ ప్రభుత్వం మీద ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఈ వేడుకను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు అత్యంత ఘనంగా జరిపించడానికి తగు ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకకు తెలుగు తారాలోకమంతా తరలి రాబోతున్నారు. కాగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎఫ్‌డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “శనివారం హైటెక్స్ వేదికగా (Hitex Venue Saturday) తెలంగాణ గద్దరు అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది.

14 సంవత్సరాల తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ అవార్డుల వేడుకను విజయవంతం చేయాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై కూడా ఉంది. ఈ వేడుక ఐ అండ్ పీఆర్ ద్వారా లైవ్ ప్రసారం కానుంది. సాయంత్రం ఆరు గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది. 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాల్లో ప్రతి ఏడాది నుంచి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి వాటికి ఈ వేడుకలో అవార్డులు అందిస్తున్నాం. ప్రతి సంవత్సరానికి సంబంధించి ఎంపికైన మూడు ఉత్తమ చిత్రాలకు పనిచేసిన హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాతలకు అవార్డులను అందిస్తు న్నాం. ఇలాంటి ఓ మంచి సాంప్రదాయాన్ని గద్దర్ ఫిల్మ్ అవార్డులతో పరిచయం చేస్తున్నాం. 2024లో విడుదలైన ఉత్తమ చిత్రాలకు, ఉత్త మ సాంకేతిక నిపుణులకు కూడా అవార్డులు అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకను తెలుగు సినీ పరిశ్రమలోని అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News