Wednesday, June 4, 2025

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో కథానాయకుడిగా అందరి హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న యూత్‌ఫుల్ క్రేజీ హీరో సంగీత్ శోభన్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘గ్యాంబ్లర్స్’.(Gamblers) ప్రశాంతి చారులింగా నాయికగా నటిస్తున్న ఈ చి త్రంలో కేసీఆర్ ఫేమ్ రాకింగ్ రాకేష్ పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్, మల్హోత్త్ర శివ, శివారెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో శ్రీవల్లి అనే సైన్స్ ఫి క్షన్ సినిమాను నిర్మించిన నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్ బృందావనంలు ఈ సినిమాను రేష్మాస్ స్టూడియోస్, స్నాప్ అండ్ క్లాప్ ఎంటర్‌టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. కేఎస్‌కే చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌చేస్తున్నారు.

కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కుమార్ బృందావనం మాట్లాడుతూ ” వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తాజాగా ‘గ్యాంబ్లర్స్’ చిత్రాన్ని నిర్మించాం. సినిమాలో అన్ని వర్గాలను అలరించే అంశాలున్నాయి. మాస్ అండ్ క్లాస్ ఎంటర్‌టైనర్‌ (Mass and class entertainer) గా అందరి మనసులను ఈ చిత్రం దోచుకుంటుంది’అని అన్నారు. మరో నిర్మాత సునీత మాట్లాడుతూ ”యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా అన్ని ఎమోషన్స్ ఈ చిత్రంలో ఉంటాయి. ఈ సినిమాలో డిఫరెంట్ సంగీత్ శోభన్‌ను చూడబోతున్నారు. ఆయన పర్‌ఫార్మెన్స్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. సినిమాలోని ప్రతి పాత్ర, ప్రతి అంశం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది‘ అని తెలిపారు. దర్శకుడు కేఎస్‌కే చైతన్య మాట్లాడుతూ ”ఫుల్ ఫ్యాకేజీలా ఈ సినిమా ఉంటుంది. అన్ని ఎమోషన్స్ ఈ చిత్రంలో ఉంటాయి. కామెడీ, గ్లామర్, మిస్టరీ కలబోతగా ఈ సినిమా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఓ కొత్త లోకంలో ఉంటారు‘అని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News